హైదరాబాద్: టీఆర్టీ ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఎట్టకేలకు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 843 మందిని ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా.. తెలుగు, ఆంగ్ల మాధ్యమం సెకండరీ గ్రేడ్ టీచర్ ఫలితాలను గతంలోనే టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రీ లింక్విష్మెంట్ తీసుకుని సెప్టెంబరు 30లోగా మళ్లీ ఫలితాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబరు నెల ముగిసినా ఫలితాలు రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇటీవలే తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఇవాళ ఆంగ్ల మాధ్యమం ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 909 ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియ నిర్వహించి 843 మందిని ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. దివ్యాంగుల కోటాలో ఎంపికైన 39 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. కోర్టు వివాదాల కారణంగా 26 పోస్టులకు సంబంధించి ఫలితాలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
TS TRT SGT RESULTS
టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: టీఆర్టీ ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఎట్టకేలకు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 843 మందిని ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా.. తెలుగు, ఆంగ్ల మాధ్యమం సెకండరీ గ్రేడ్ టీచర్ ఫలితాలను గతంలోనే టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రీ లింక్విష్మెంట్ తీసుకుని సెప్టెంబరు 30లోగా మళ్లీ ఫలితాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబరు నెల ముగిసినా ఫలితాలు రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇటీవలే తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఇవాళ ఆంగ్ల మాధ్యమం ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 909 ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియ నిర్వహించి 843 మందిని ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. దివ్యాంగుల కోటాలో ఎంపికైన 39 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. కోర్టు వివాదాల కారణంగా 26 పోస్టులకు సంబంధించి ఫలితాలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
హైదరాబాద్: టీఆర్టీ ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఎట్టకేలకు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 843 మందిని ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా.. తెలుగు, ఆంగ్ల మాధ్యమం సెకండరీ గ్రేడ్ టీచర్ ఫలితాలను గతంలోనే టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రీ లింక్విష్మెంట్ తీసుకుని సెప్టెంబరు 30లోగా మళ్లీ ఫలితాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబరు నెల ముగిసినా ఫలితాలు రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇటీవలే తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఇవాళ ఆంగ్ల మాధ్యమం ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 909 ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియ నిర్వహించి 843 మందిని ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. దివ్యాంగుల కోటాలో ఎంపికైన 39 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. కోర్టు వివాదాల కారణంగా 26 పోస్టులకు సంబంధించి ఫలితాలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు టీఎస్పీఎస్సీ పేర్కొంది.